వినియోగదారులు ప్రతి గంటా బంగారాన్ని గెల్చుకునే అవకాశం ఉంది!


 సోనే పె సుహాగా’ క్యాంపెయిన్‌తో పండుగ ఉత్సాహాన్ని తీసుకువచ్చిన ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్

భారతదేశంలో పండుగ సీజన్ ఆనందం, కొత్త ప్రారంభాలు, శుభ సంప్రదాయాలకు పర్యాయపదంగా ఉంటుంది. కొన్ని చిహ్నాలు బంగారం కన్నా మెరుగ్గా ఉంటాయి. ఈ పండుగ స్ఫూర్తిని స్వీకరించి, ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్ తన పాన్-ఇండియా క్యాంపెయిన్ సోనే పె సుహాగాను ప్రకటించింది. వినియోగదారులకు ఇంటికి విశ్వసనీయ ఆవిష్కరణలతో పాటు బంగారు బహుమతులతో సీజన్‌ను ఘనంగా ఆచరించుకునే అవకాశాన్ని అందిస్తుంది.

క్యాంపెయిన్ ప్రధాన  ఉద్దేశంలో పండుగ సీజన్ దైనందిన జీవితాన్ని సరళం చేస్తూనే శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం గురించి అని ఫిలిప్స్ విశ్వసిస్తోంది. ఐకానిక్ ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్, మిక్సర్ గ్రైండర్లు, కాఫీ మెషిన్లు, గార్మెంట్ స్టీమర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు తదితరాలు కలిగి ఉన్న ఉత్పత్తుల శ్రేణి ఇందులో ఉన్నాయి. ంటిని నివాసంగా మార్చడానికి బ్రాండ్ ఆవిష్కరణ, సౌలభ్యం, సంరక్షణను సమ్మిళతం చేస్తోంది.

నెల పాటు కొనసాగే ఈ క్యాంపెయిన్ కొనుగోలుదారులకు ప్రతి గంటకు, నిత్యం రూ.9,999 విలువైన బంగారాన్ని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్ సోషల్ మీడియా, రేడియో ద్వారా గంటకు ఒకసారి, జాతీయ వార్తాపత్రికల ద్వారా రోజువారీ విజేతలను ప్రకటిస్తుంది.

క్యాంపెయిన్ గురించి వెర్సుని ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పూజా బైద్ మాట్లాడుతూ, భారతదేశంలో పండుగ అంటే ఆనందం, కలిసి ఉండటం, అర్థవంతమైన క్షణాలు. బంగారం ఎల్లప్పుడూ ఈ వేడుకలలో ఒక ముఖ్యమైన భాగం; శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నం. మా సోనే పే సుహాగా క్యాంపెయిన్‌తో, బంగారం గెలుచుకున్న ఉత్సాహాన్ని ఫిలిప్స్ విశ్వసనీయ ఆవిష్కరణల హామీతో జత చేస్తున్నాము. ఈ పండుగ సీజన్‌లో ప్రతి వేడుకకు మరింత మెరుపును జోడించడానికి ఇది మా మార్గం’’ అని వివరించారు.

సోనే పే సుహాగా ప్రచారం ఫిలిప్స్  దీర్ఘకాల వాగ్దానాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో పండుగ సీజన్‌ను మరింత సందర్భోచితంగా, ప్రతిఫలదాయక, ఆవిష్కరణగా మారుస్తుంది. ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 22, 2025 వరకు కొనసాగుతుంది. ఇది ₹1,000 కన్నా ఎక్కువ విలువైన ఏదైనా ఫిలిప్స్ ఉత్పత్తిని ఏదైనా ఆఫ్‌లైన్ స్టోర్‌లో లేదా ఫిలిప్స్ హోమ్ అప్లయెన్సెస్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయమని, ప్రచార QR కోడ్ ద్వారా నమోదు చేసుకోవాలని, ప్రతి గంటకు ₹9,999 విలువైన బంగారు వోచర్‌లను గెలుచుకునే అవకాశాన్ని పొందమని వినియోగదారులను ఆహ్వానిస్తుంది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఉత్తేజకరమైన హామీ బహుమతులు కూడా లభిస్తాయి. ఇది ప్రతి కొనుగోలును మరింత ప్రయోజనకరంగా మారుస్తుంది.

Comments

Popular posts from this blog

Xiaomi India launches three new Redmi Smartphones

e in building India’s future-ready skilling ecosystem with NCVET, Ministry of Skill Development & Entrepreneurship

Awareness Initiative by SBI Mutaul Fund